
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రూ. 21.34 కోట్ల పన్నులను పుష్కర కాలంగా ఎగ్గొడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిర్ణీత ప్రమాణాల కంటే 70 శాతం అధికంగా వ్యర్థాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నందుకు యాజమాన్యానికి సమన్లు జారీ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పందించని మిల్లు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేయాలని పీసీబీ అధికారులకు సూచించారు.