విటమిన్ డి, బి12 మరియు ఐరన్ లోపాలు నిరంతర ఒళ్లు నొప్పులకు ప్రధాన కారణమని, వీటిని రక్త పరీక్షల ద్వారా గుర్తించి చికిత్స పొందవచ్చని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
నొప్పులు 2-3 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగినా, లేదా జ్వరం, కీళ్ల వాపులు, ఆయాసం వంటి లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, రోజుకు 7-8 గంటల నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు హెచ్చరించారు.