అమెరికాలోని టెక్సాస్కు చెందిన అలోండ్రా సియెర్రా 19 ఏళ్ల వయసులో గుర్తించిన చర్మ క్యాన్సర్ (మెలనోమా) కారణంగా 26 ఏళ్ల వయసులో మరణించింది.
క్యాన్సర్ ఆమె పుర్రె, వెన్నుముక, పెల్విస్ మరియు మెదడుకు విస్తరించడంతో శస్త్రచికిత్సలు, రేడియేషన్ చికిత్సలు ఫలించలేదు.
చనిపోయే ముందు ఆమె చర్మంపై పుట్టుమచ్చలు, రంగులో మార్పులను గమనించే 'ఏబీసీడీఈ' సూత్రంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించింది.