
తూర్పు గోదావరి జిల్లాలో కానిస్టేబుల్పై దాడి చేసి పరారైన గంజాయి ముఠా ప్రధాన నిందితుడు అక్కిదాసరి అవినద్ను కృష్ణా జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కంకిపాడు వద్ద పోలీసులపై రాళ్లు, కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాళ్లకు గాయాలయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్ శ్రీనును ఆస్పత్రికి తరలించగా, కేసు దర్యాప్తునకు గుడివాడ ఎస్డీపీఓ పి.శ్రీనివాస్ను ప్రత్యేకాధికారిగా నియమించారు.