
నైజీరియాలోని లాగోస్లో జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మొదటిసారి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి 'విల్కిన్సన్ సోర్డ్' ట్రోఫీని కైవసం చేసుకుంది.
భారత ఫెన్సర్లు అండర్-23 మరియు సీనియర్ విభాగాల్లో కలిపి మొత్తం 35 పతకాలను (13 స్వర్ణం, 8 రజతం, 14 కాంస్యం) సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచారు.
పోటీల చివరి రోజున సీనియర్ ఫెన్సర్లు పురుషుల, మహిళల సబ్రే, ఎపీ మరియు మహిళల ఫాయిల్ విభాగాల్లో ఐదు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.