
టైప్-2 మధుమేహం ఉన్నవారు డెంగ్యూ బారిన పడితే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
డయాబెటిస్ వల్ల రోగ నిరోధక శక్తి బలహీనపడటం, ప్లేట్లెట్స్ పనితీరు మందగించడం వంటి కారణాల వల్ల డెంగ్యూ తీవ్రత పెరుగుతుందని డాక్టర్ వినీత్ కుమార్ సురానా వివరించారు.
జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్, హెమటోక్రిట్ స్థాయిలను పరీక్షించుకోవాలని, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ద్వారా ముప్పును తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.