
సౌదీ అరేబియా నుండి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానంలోని ఒక టిష్యూ పేపర్పై బాంబ్ అనే బెదిరింపు సందేశం రాయబడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి భద్రతా అధికారులను అప్రమత్తం చేశారు.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన అనంతరం భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.