
ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తదుపరి చికిత్స కోసం కేరళ రాష్ట్రానికి వెళ్లారు.
త్రిస్సూర్ సమీపంలోని ఒక ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స పొందనున్నట్లు సమాచారం.
శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్, అక్కడి నుండి నేరుగా వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.