
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ. 24,113 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 21,201.47 కోట్ల లాభంతో పోలిస్తే, ఈసారి 13.73 శాతం వృద్ధిని బ్యాంక్ సాధించింది.
మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 19,642.87 కోట్లుగా ఉండగా, తాజా ఫలితాల్లో గణనీయమైన పురోగతి కనిపించింది.