
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి లీడర్షిప్ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
2029 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.