బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం అల్పపీడనం బలపడటంతో అధికారులు సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు మరియు మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని కోరారు.