
అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకలో ఎనిమిది నెలలుగా విధుల్లో ఉన్న ఆరుగురు సైనికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆహారం, నీటి కొరత మరియు మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడంతో సైనికులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని మిలిటరీ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి సైనికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని నౌకాదళ అంబుడ్స్మెన్ సమాచారం అందించింది.