ప్రపంచకప్ హాకీ టోర్నీలో భాగంగా నేడు భారత్ మరియు నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
పాకిస్థాన్పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న టీమ్ ఇండియా, ఈ మ్యాచ్లో గెలిచి తదుపరి రౌండ్కు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్తో జరుగుతున్న ఈ పోరులో భారత ఆటగాళ్లు అలసత్వం వహించకుండా ఆడాలని కోచ్లు సూచించారు.