గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ మండేగ్బమ్ పాకిస్థాన్ బాక్సర్ సుమామా రెహ్మన్పై 5-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు.
జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ విజయాన్ని సాధించిన జాదుమణి, తన గెలుపును కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం చేశాడు.
మంగళవారం జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే జాదుమణి సెమీఫైనల్కు చేరుకోవడంతో పాటు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు.