
పారిస్లో జరుగుతున్న ఈ-స్పోర్ట్స్ ప్రపంచకప్ చెస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్లో భారత గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేశి, నిహాల్ సరీన్ పరాజయం పాలయ్యారు.
అర్జున్ ఇరిగేశి ఆర్మగెడాన్ రౌండ్లో హికరు నకముర చేతిలో ఓడిపోగా, నిహాల్ సరీన్ 0.5-2.5 స్కోరుతో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమిని చవిచూశారు.
గత ఏడాది జరిగిన టోర్నీలో కూడా ఇదే ప్రత్యర్థుల చేతిలో వీరు ఓడిపోవడం గమనార్హం.