
మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారథిల తీవ్ర ఒత్తిడి కారణంగా విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా చేయాలనే ఒత్తిడిని తట్టుకోలేక ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మంత్రులు అక్కడికి వెళ్లి కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు.
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఈ రాజీనామా జరిగిందని మంత్రి పార్థసారథి ప్రకటించగా, ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒకరోజు గడువు కోరినప్పటికీ మంత్రులు అంగీకరించలేదు.