
ఉక్రెయిన్లోని కీవ్ ప్రాంతంపై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో జగిత్యాల జిల్లా హస్నాబాద్కు చెందిన వావిలాల సుదర్శన్గౌడ్ (42) మరణించాడు.
మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ భారీ దాడుల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక సమాచారం ద్వారా తెలిసింది.
నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం ఉక్రెయిన్ వెళ్లిన సుదర్శన్గౌడ్, గది నుంచి బయటకు వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.