
పూరి జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్జేటీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆలయానికి వివిధ బ్యాంకుల్లో రూ. 1,912 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 24 జిల్లాల్లో 60,426 ఎకరాలు, పశ్చిమ బెంగాల్తో సహా ఆరు రాష్ట్రాల్లో 395 ఎకరాలు కలిపి మొత్తం 60,821 ఎకరాల భూమి ఆలయం పేరు మీద ఉంది.
ఆగస్టు 31 నాటికి 'సమర్పణ్' డిజిటల్ డొనేషన్ ప్లాట్ఫాం ద్వారా రూ. 56.71 లక్షల విరాళాలు సేకరించినట్లు ఎస్జేటీఏ ముఖ్య నిర్వాహకుడు అరబింద కుమార్ పాధీ తెలిపారు.