
చట్టవిరుద్ధమైన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో భాగంగా ప్రముఖ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో నిధి అగర్వాల్తో పాటు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 21 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసు నమోదు చేసింది.
సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేస్తూ, సెలబ్రిటీల ఆర్థిక లావాదేవీలు మరియు డిజిటల్ ట్రైల్స్పై ఆరా తీస్తోంది.