
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లోని నానా మామ్బేరు ప్రిఫెక్చర్ అబ్బా ప్రాంతంలో మంగళవారం బంగారం గని కూలిపోవడంతో 30 మంది కార్మికులు మరణించారు.
స్థానిక డిప్యూటీ మేయర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు, గనిలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ యంత్రాలు లేని ఆర్టిసనల్ మైన్స్లో పనిచేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని అధికారులు ప్రకటించారు.