
ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సోమవారం నుంచి స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో ప్రారంభించింది.
దరఖాస్తుల పరిశీలన 20 రోజుల్లో ముగియనుండగా, అర్హులైన వారికి అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 61.92 లక్షల మందికి పింఛన్లు అందుతుండగా, నెలకు రూ.2,693.90 కోట్ల వ్యయం అవుతోందని ప్రభుత్వం వెల్లడించింది.