
కర్ణాటకలోని బాదామిలో ఉన్న భూతనాథ సరస్సులో బుధవారం ఉదయం ఆరు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి, అవి ఒకే కుటుంబానికి చెందినవా లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
సరస్సులో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఇది ఆత్మహత్య లేక ప్రమాదమా అనే అంశాలపై విచారణ చేస్తున్నారు.