
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టుకు ఈనెల 31న సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేస్తారని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకటించారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికే మూడు విడతల్లో రూ. 250 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేశామని, చివరి లబ్ధిదారుడికి కూడా పరిహారం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు.
1996లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును పూర్తి చేసి, పోలవరం ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.