
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా (24) గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందారు.
చీరాల బీచ్కు వెళ్తుండగా, ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో అఫిఫా ప్రయాణిస్తున్న కారు దానిని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో గాయపడిన మరో నలుగురు ప్రయాణికులను స్థానిక ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.