
తమ ఉత్పత్తులు 100% స్వచ్ఛమైనవని, రసాయనాలు లేనివని చేసే ప్రచారాలను నిలిపివేయాలని డాబర్ కంపెనీని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది.
తేనె, ఆవునెయ్యి, వంటనూనెలు, కొబ్బరినూనె వంటి ఉత్పత్తులపై ఇటువంటి క్లెయిమ్స్ ఉండకూడదని స్పష్టం చేసింది.
వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలను తొలగించాలని నియంత్రణ సంస్థ సూచించింది.