
శ్రీశైలంలోని ఒక సత్రంలో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్, అతని ముగ్గురు అక్కలు, మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది.
సుధాకర్ ఆటో నడుపుతూ రూ.కోటి పైగా అప్పులు చేసి నష్టపోవడం, కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
గతనెల 28న శ్రీశైలానికి వచ్చిన ఈ కుటుంబం, 28 రోజులుగా సత్రంలోనే ఉంటూ చివరకు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.