
రూ. 1,000 కోట్ల సైబర్ మోసాల కేసులో కీలక సూత్రధారిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్పెషల్ టీం పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఈ భారీ సైబర్ మోసాలకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.