
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ ద్వయం క్వార్టర్ ఫైనల్కు చేరుకుని భారత్కు పతకాన్ని ఖాయం చేసింది.
శుక్రవారం జరిగిన మ్యాచ్లో నాలుగో సీడ్ చైనా జోడీ జియా యీ ఫాన్ - ఘాంగ్ షు గ్జియాన్పై 16-21, 21-15, 21-13 తేడాతో భారత జోడీ సంచలన విజయం సాధించింది.
2011లో అశ్విని పొన్నప్ప, గుత్తా జ్వాల తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళా డబుల్స్ జోడీగా త్రిసా-గాయత్రి రికార్డు సృష్టించారు.