
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
విజయనగరం జిల్లా సతివాడలో 4.95 సెం.మీ, అనంతపురంలో 3.62 సెం.మీ, బొబ్బిలిలో 3.25 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మంగళవారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది.