
భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది.
ఆదివారం జరిగిన క్వాలిఫయర్ గ్రూప్-బి ఆఖరి పోరులో భారత్ 3-0 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్ల్లో 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో డ్యానీ మైతే (25వ నిమిషం), విశాల్ యాదవ్ (60వ నిమిషం), మహమ్మద్ అర్బాష్ (79వ నిమిషం) తలో గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.