
రష్యా రాజధాని మాస్కోలోని కుడ్రిన్స్కాయా స్క్వేర్ రెస్టారెంట్లో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించారు.
ఈ ఘటనలో మరో 21 మంది తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేలుడు పదార్థాలను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను సెక్యూరిటీ గార్డు అడ్డుకోగా, ఆ సమయంలోనే బాంబు పేలినట్లు రియా నోవోస్తి వార్తా సంస్థ తెలిపింది.