
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్పై ప్రస్తుతానికి కొత్తగా దాడులు చేయబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మిత్రదేశాలకు స్పష్టం చేశారు.
ఇరాన్ వైపు నుంచి దాడులు పునరావృతమైతే సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని అమెరికా తోసిపుచ్చలేదని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతానికి దాడులు ఆగినప్పటికీ, ఇరాన్పై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది.