
దుబాయ్ వేదికగా ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి విడుదల చేసింది.
గ్రూప్-ఎలో ఉన్న భారత్, సెప్టెంబర్ 5న పాకిస్థాన్తో తలపడనుండగా, ఆగస్టు 30న థాయ్లాండ్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేసియా ఉండగా, సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.