
వాతావరణ మార్పులు మరియు ఎల్నినో ప్రభావం వల్ల భారత్లో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో అసమానతల కారణంగా దోమల వృద్ధి వేగవంతమవుతోంది.
ఢిల్లీలో ఒక్క ఆగస్టు నెలలోనే కొత్తగా 90 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.