
దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1.57 లక్షలకు చేరుకోగా, వెండి కిలోకు రూ.2,000 పెరిగి రూ.2.42 లక్షలకు చేరింది.
గడిచిన ఆరు రోజుల్లోనే బంగారం ధర రూ.9,800 మేర పెరగడం గమనార్హం, ఇది గత రెండు నెలల గరిష్ఠ స్థాయి.
అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల మరియు ట్రేడర్ల నుంచి బలమైన డిమాండ్ కారణంగా ఈ ధరల పెరుగుదల నమోదైందని విశ్లేషకులు పేర్కొన్నారు.