
అమెరికా సైనికుడిని హతమార్చినా లేదా సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా ఇస్తామని ఇరాన్ సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఈ చర్యకు పాల్పడే మహిళలకు రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు అందిస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ వెల్లడించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది.
హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ ప్రకటన అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.