ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరిగింది.
రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.