
శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై దాడికి పాల్పడిన 21 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
మహిళలను అవమానించడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని, ఈ ఘటన తీవ్ర ఆక్షేపణీయమని లోకేశ్ ఎక్స్లో విమర్శించారు.