
షెన్జెన్లో జరిగిన చైనా మాస్టర్స్ 2026 పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.
భారత జోడీ 11-21, 21-13, 21-17 స్కోరుతో చైనాకు చెందిన హీ జి టింగ్–రెన్ షియాంగ్ యూ జంటపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ చారిత్రక విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, భారత బ్యాడ్మింటన్కు ఇది గర్వకారణమని కొనియాడారు.