
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్పై రెండు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఆరో భారత బౌలర్గా నిలిచారు.
షమీ తన కెరీర్లో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379, లిస్ట్-ఏలో 283, టీ20 ఫార్మాట్లో 238 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించారు.
భారత పేసర్లలో కపిల్ దేవ్ 1170 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, జహీర్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, జవగల్ శ్రీనాథ్, వినయ్ కుమార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.