
గుజరాత్లోని అహ్మదాబాద్ ఆనంద్నగర్ ప్రాంతంలో గల ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఇంటీరియర్ డిజైనింగ్ చదువుతున్న విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆగస్టు 8న రాత్రి 10 గంటల సమయంలో డిన్నర్ ముగించుకుని వాకింగ్ కోసం టెర్రస్పైకి వెళ్లిన యువతి మెడకు వైరు చుట్టి బంధించి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాకు చెందిన నిందితుడు ధరమ్ సింగ్ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.