
భారత్-ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ సందర్భంగా స్టేడియంలో జరిగిన సరదా ఇంటర్వ్యూలో ఒక ఆఫ్ఘన్ యువతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారత జట్టు నుంచి ఏ ఆటగాడిని కిడ్నాప్ చేసి ఆఫ్ఘనిస్థాన్కు తీసుకెళ్తావు అని క్రియేటర్ అడగగా, ఆమె యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు చెప్పింది.
టీ20ల్లో అభిషేక్ శర్మ వరుస ఇన్నింగ్స్లతో సృష్టిస్తున్న విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా అతనికి అంతర్జాతీయంగా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.