
రాజస్థాన్లోని జైపూర్లో గురువారం ఉదయం 11:30 గంటలకు ఒక యువతి 20 లక్షల రూపాయల విలువైన ఉంగరాల బాక్స్తో పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయింది.
షాపు యజమాని త్రిలోక్ చంద్ ప్రజాపత్ వెంబడించగా 500 మీటర్ల దూరంలో పట్టుబడిన యువతి, తాను జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించింది.
నిందితురాలి బ్యాగులో కారం పొడి, పెప్పర్ స్ప్రే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆమెను జోత్వారా పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు.