
నమీబియా పర్యటన కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ బిజోర్న్ ఫార్చూన్ కెప్టెన్గా ఎంపికయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా జింబాబ్వేతో కలిసి ట్రై సిరీస్లో పాల్గొని, అనంతరం నమీబియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
మార్కో యాన్సెన్ కవల సోదరుడు డువాన్ యాన్సెన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వగా, సీనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.