
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ద్వారా పాకిస్థాన్ పేస్ బౌలర్ రజవుల్లా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 4 వికెట్లు పడగొట్టినప్పటికీ, 6.40 ఎకానమీతో 148 పరుగులు సమర్పించుకున్నాడు.
దీంతో టెస్ట్ అరంగేట్రంలో పాకిస్థాన్ తరఫున అత్యధిక ఎకానమీతో పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో అతను రెండో స్థానంలో నిలిచాడు.