
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త వినియోగదారుల కోసం తన ప్రసిద్ధ 'ఫ్రీడమ్ ప్లాన్'ను తిరిగి అందుబాటులోకి తెచ్చింది.
దేశవ్యాప్తంగా జరుపుకోనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ను సంస్థ ప్రకటించింది.
కేవలం రూ.1 కే లభించే ఈ ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.