విశాఖపట్నం షీలానగర్లో రోడ్డు విస్తరణ పనుల కోసం మట్టిని తవ్వుతుండగా నాలుగు మృతదేహాలు, తొమ్మిది మానవ పుర్రెలు బయటపడటం కలకలం రేపింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మట్టిని ఎక్కడి నుంచి తరలించారో ఆరా తీస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.