
మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్లో 'ఇండియా సౌత్ సెంట్రల్' పేరుతో తన నాలుగో క్లౌడ్ రీజియన్ను గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చింది.
ఈ రీజియన్లో మూడు అవైలబిలిటీ జోన్లు ఉన్నాయని, నీటి వినియోగం లేని కూలింగ్ సాంకేతికతను ఇక్కడ ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
భారతదేశంలో ఇప్పటికే పుణె, చెన్నై, ముంబై నగరాల్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్లు పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ వెల్లడించారు.