
ఉక్రెయిన్లోని భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిత్తల్కు చెందిన ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్ మరియు మెటలర్జికల్ కాంప్లెక్స్పై రష్యా క్షిపణి దాడి చేయడంతో ఇద్దరు మరణించారు.
ఈ దాడిలో 14 మంది కార్మికులు గాయపడగా, కర్మాగారంలోని ఇంధన మరియు బ్లాస్ట్-ఫర్నేస్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది.
ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది, అలాగే తాము 822 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామని వెల్లడించింది.