
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సంభవించిన ఆకస్మిక వరదల వల్ల 20 మందికి పైగా గల్లంతయ్యారు.
వరద ఉద్ధృతికి పాదచారుల వంతెనలు, లోహ నిర్మాణాలు కొట్టుకుపోగా, ఫాంటమ్ రాంచ్లో ఉన్న 62 మందిని అధికారులు సురక్షితంగా తరలించారు.
ప్రమాద తీవ్రత దృష్ట్యా బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్, నార్త్ కైబాబ్ ట్రైల్ను మూసివేసి, కొలరాడో నదిపై రాఫ్టింగ్ యాత్రలను అధికారులు నిలిపివేశారు.